రిటైర్మెంట్ తీసుకుని బొమ్మలు వేసుకుందామనుకున్న

రిటైర్మెంట్ తీసుకుని బొమ్మలు వేసుకుందామనుకున్న

హైదరాబాద్, వెలుగు: రిటైర్మెంట తీసుకుని ఇష్టమైన బొమ్మలేసుకుందా మనుకున్నానని, కానీ సీఎం కేసీఆర్ పిలిచి టికెట్ ఇచ్చారని హైదరాబాద్ –రంగారెడ్డి –మహబూబ్ నగర్ టీఆర్ఎస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ క్యాండి డేట్, పీవీ కూతురు వాణీదేవి అన్నారు. నాన్నకు రిటైర్మెంట్ సమయంలో ప్రధాని పదవి వచ్చినట్టు తనకు ఈ టైమ్ లో పోటీచేసే చాన్స్ వవచ్చిందన్నారు. గ్రాడ్యుయేట్ల సమస్యలేంటో తనకు తెలుసునని, గెలిస్తే సర్కారుతో మాట్లాడి పరిష్కరిస్తానన్నారు. బుధవారం తెలంగాణ భవన్ లో కేటీఆర్ తో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. పీవీ బిడ్డగా నరనరాన ప్రజాసేవ జీర్ణించుకుని ఉందని, విద్యాలయాల ద్వారా 35 ఏళ్లుగా సేవలు అందిస్తున్నానని పేర్కొన్నారు. తమ సంస్థల్లో చదవుకున్న వారు అనేక రంగాల్లో అత్యున్నత స్థాయిలో పనిచేస్తున్నారని, స్టూడెంట్స్ కు 100 శాతం క్యాంపస్ ప్లేస్ మెం ట్స్ దొరుకుతున్నాయని చెప్పా రు.