
న్యూఢిల్లీ: ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (క్యూఐఏ) రిలయన్స్ రిటైల్ వెంచర్స్లో మైనారిటీ వాటాను కొనడానికి చర్చలు జరుపుతున్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్ తెలిపింది. ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ నాయకత్వంలోని ఆర్ఆర్విఎల్లో ఖతార్ సావరిన్ వెల్త్ ఫండ్ సుమారు బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది. ఫలితంగా క్యూఐఏకు కంపెనీ ఒక శాతం వాటా దక్కుతుంది. ఈ నెల ప్రారంభంలో రిలయన్స్ రిటైల్ వాల్యుయేషన్ 96 బిలియన్ డాలర్ల వరకు ఉంది. ఇప్పటి వరకు, ఖతారీ సావరిన్ ఫండ్ ద్వారా ఈ డీల్కు ఎటువంటి ఆమోదం రాలేదని, చర్చలు ప్రారంభ దశలోనే ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ వార్తలు వచ్చాక, స్టాక్ మార్కెట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్ విలువ 1.62 శాతం వరకు పెరిగింది.