హైదరాబాద్, వెలుగు: టీఎస్పీఎస్సీ మొత్తం కుళ్లిపోయిందని పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ విమర్శించారు. శనివారం ఆయన మరో అధికార ప్రతినిధి రియాజ్తో కలిసి గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు వాయిదా వేస్తే రెండు నెలల వరకు పరీక్ష పెట్టడం కుదరదంటూ టీఎస్పీఎస్సీ లీకులిస్తున్నదని ఫైర్ అయ్యారు. ఆఫ్లైన్లో రాసే పరీక్షకు సెంటర్ల సమస్య ఎందుకు వస్తదని ప్రశ్నించారు.
ప్రెస్మీట్ పెట్టినా అరెస్ట్ చేస్తామంటూ పోలీసులు బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతలను కలిసేందుకు కమిషన్ చైర్మన్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. అభ్యర్థులకు న్యాయం చేయాలనే ఆలోచన టీఎస్పీఎస్సీకి లేనే లేదని రియాజ్ మండిపడ్డారు. పేపర్లీకులు, గందరగోళం మధ్యనే పరీక్షలను నిర్వహిస్తున్నారని విమర్శించారు.