కుత్బుల్లాపూర్​లో భూ రిజిస్ట్రేషన్​ సమస్యలకు పరిష్కారం

కుత్బుల్లాపూర్​లో భూ రిజిస్ట్రేషన్​ సమస్యలకు పరిష్కారం
  • సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ​తనిఖీ చేసిన డీఐజీ

జీడిమెట్ల, వెలుగు: సూరారంలోని కుత్బుల్లాపూర్​ సబ్​రిజిస్ట్రార్ ఆఫీస్​ను రిజిస్ట్రేషన్ ​అండ్​స్టాంప్స్​ డీఐజీ మధుసూదన్​ గురువారం తనిఖీచేశారు. కుత్బుల్లాపూర్​లో 41 గుంటల వక్ఫ్​భూమి ఉందని, కొంతకాలంగా 171 సర్వే నెంబర్లలో   ఎలాంటి రిజిస్ట్రేషన్​లు చేయడం లేదు. దీంతో అనేక కాలనీల ప్రజలు క్రయవిక్రయాలు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై ప్రజలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో.. స్పందించిన డీఐజీ మధుసూదన్​ జిల్లా రిజిస్ట్రార్ అశోక్​తో కలిసి తనిఖీ చేశారు. పలు విషయాలను ఆఫీస్​లోని అధికారులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సాధ్యమైనంత త్వరలో సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు.