బీఆర్​ఎస్ పాలనలో 6 వేల స్కూళ్ల మూసివేత : ఆర్.కృష్ణయ్య

బీఆర్​ఎస్ పాలనలో 6 వేల స్కూళ్ల మూసివేత : ఆర్.కృష్ణయ్య

ముషీరాబాద్, వెలుగు: పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో 6 వేలకు పైగా ప్రభుత్వ స్కూళ్లను మూసి వేశారని రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య చెప్పారు. వీటిని యధావిధిగా కొనసాగించి డీఎస్సీ కింద 24 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. 

ఈ మేరకు ఆదివారం ఆయన సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. టీచర్ పోస్టులను భర్తీ చేస్తేనే ఆయా స్కూళ్లు కొనసాగే పరిస్థితి ఉందన్నారు. 16 వేల స్కూళ్లలో ఇంగ్లీష్, మాథ్స్, సైన్స్ టీచర్లు లేరని, విద్యార్థులు చదువులో వెనకబడిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.