- ధర్నా చౌక్లో సోషలిస్ట్ పార్టీ ఆఫ్ఇండియా ప్రతినిధుల డిమాండ్
ముషీరాబాద్, వెలుగు : ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించడం వల్ల ఎన్నో అపోహలు ఉంటున్నాయని.. వాటిని రద్దు చేసి బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్. సుభద్రా రెడ్డి కోరారు. ‘ఈవీఎంలను విస్మరించండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. ఈవీఎంలు వద్దు.. బ్యాలెట్ పేపర్ కావాలి’ అంటూ సోషలిస్టు పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఇందిరా పార్కు ధర్నాచౌక్లో నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా సుభద్రా రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పద్ధతులకు అనుగుణంగా బ్యాలెట్ పేపర్లతో ఓటింగ్ వేసే పద్ధతిని ఎన్నికల కమిషన్ తిరిగి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో గోపాల పతంగి, ఖదీర్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.