
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని లాంగ్వేజీ పండిట్లు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న గ్రేడ్2 పోస్టులను అప్గ్రేడ్ చేయాలని రాష్ర్టీయ ఉపాధ్యాయ పండిత పరిషత్(ఆర్-యూపీపీ) కోరింది. ఈ మేరకు బుధవారం ఫైనాన్స్ మినిస్టర్ హరీశ్ రావును ఆర్-యూపీపీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సీ. జగదీశ్, ఎస్.నర్సిములు కలిసి వినతిపత్రం అందజేశారు.
భాషా పండితుల అప్గ్రేడ్కోసం సర్కారు జీవో ఇచ్చినా, ఇంకా అమలు కాలేదని ఆర్ యూపీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన మంత్రి హరీశ్ రావు..లాంగ్వేజీ పండిట్ పోస్టుల అప్గ్రేడ్కోసం ప్రాసెస్ నడుస్తోందని తెలిపారు. న్యాయపరమైన చిక్కులను త్వరలోనే అధిగమించి, అందరికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.