సివిల్ తగాదాల్లో జోక్యం.. ఇబ్రహీంపట్నం సీఐపై వేటు

 సివిల్ తగాదాల్లో జోక్యం.. ఇబ్రహీంపట్నం సీఐపై వేటు

రాచకొండ: ఇబ్రహీంపట్నం సీఐ ఆంజనేయులుపై వేటు పడింది. సివిల్ తగాదాల్లో జోక్యం చేసుకున్న సీఐ ఆంజనేయులుపై రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి సీరియస్ అయ్యారు. దీంతో ఫిబ్రవరి 19వ తేదీ సోమవారం ఉదయం సీఐ ఆంజనేయులునుహెడ్ క్వార్టర్ కు అటాచ్ చేశారు. ఈ మేరకు తరుణ్ జోసీ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం ఇబ్రహీంపట్నం ఇంచార్జ్ గా యాచారం ఇన్స్పెక్టర్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు.