
కాశీబుగ్గ, వెలుగు: శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఆర్ఏఎఫ్ బలగాల కవాతు నిర్వహిస్తున్నట్లు వరంగల్ఏసీపీ నందిరామ్ నాయక్ అన్నారు. వరంగల్ సిటీలో ఆదివారం ర్యాపిడ్యాక్షన్ఫోర్స్బలగాలు కవాతు నిర్వహించాయి.
ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ వరంగల్ సిటీ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు బలగాలు సిటీలోని పోచమ్మమైదాన్, మండిబజార్, చార్బౌళి, వరంగల్ చౌరస్తా, పోస్టు ఆఫీస్, రైల్వే స్టేషన్, వెంకట్రామ జంక్షన్, తెలంగాణ జంక్షన్, చింతల్ బ్రిడ్జి, మట్టికొట, ఖిలా వరంగల్లో కవాతు నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో 100మంది ఆర్ఏఎఫ్ బలగాలు, మట్టెవాడ, ఇంతేజార్గంజ్, మిల్స్కాలనీ సీఐలు, ట్రాఫీక్ సీఐ, ఎస్సైలు, పోలీసులు తదితరులున్నారు.