శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్​ కవాతు

శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్​ కవాతు

కాశీబుగ్గ, వెలుగు: శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఆర్ఏఎఫ్ బలగాల కవాతు నిర్వహిస్తున్నట్లు వరంగల్​ఏసీపీ నందిరామ్ నాయక్  అన్నారు. వరంగల్​ సిటీలో ఆదివారం ర్యాపిడ్​యాక్షన్​ఫోర్స్​బలగాలు కవాతు నిర్వహించాయి. 

ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ వరంగల్ సిటీ పోలీస్​ కమిషనర్​ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు బలగాలు సిటీలోని పోచమ్మమైదాన్, మండిబజార్, చార్​బౌళి, వరంగల్​ చౌరస్తా, పోస్టు ఆఫీస్, రైల్వే స్టేషన్, వెంకట్రామ జంక్షన్, తెలంగాణ జంక్షన్, చింతల్​ బ్రిడ్జి, మట్టికొట, ఖిలా వరంగల్​లో కవాతు నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో 100మంది ఆర్ఏఎఫ్​ బలగాలు, మట్టెవాడ, ఇంతేజార్​గంజ్, మిల్స్​కాలనీ సీఐలు, ట్రాఫీక్​ సీఐ, ఎస్సైలు, పోలీసులు తదితరులున్నారు.