రఘునాథపాలెంను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

రఘునాథపాలెంను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
  • రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం టౌన్, వెలుగు: రఘునాథపాలెం మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం పుఠాని తండా, సూర్య తండాలో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాలను స్థానిక సంస్థల అడిషనల్​కలెక్టర్ పి.శ్రీజతో కలిసి ప్రారంభించారు. రైతులు ఆయిల్ పామ్ సాగు చేయాలన్నారు. మంచుకొండలో రైతు బజార్ ఏర్పాటు చేశామని, కూరగాయలు చెడిపోకుండా ఉండేందుకు ఏసీ వాహనాలు సబ్సిడీపై అందిస్తామని తెలిపారు.

 అనంతరం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్​అందజేశారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతరావు, జడ్పీ సీఈవో దీక్షా రైనా, డీపీవో ఆశాలత, ఖమ్మం ఆర్డీవో నరసింహారావు, తహసీల్దార్ శ్వేత, ఎంపీడీవో అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 

కల్లూరులో  సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలి

కల్లూరు, వెలుగు: కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని జాతీయ రహదారిపై సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని, డివైడర్ల ఎత్తు పెంపు, పూల మొక్కల పెంపకం, డ్రైనేజీల ఆధునీకరణ వంటి పనులు చేపట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. గురువారం సత్తుపల్లి నుంచి ఖమ్మం వెళ్తున్న ఆయన మార్గమధ్యలో కల్లూరు పట్టణంలో కాసేపు ఆగారు.

మున్సిపల్ ఇన్​చార్జి కమిషనర్ సంపత్ కుమార్ మున్సిపాలిటీకి మంజూరైన రూ.15 కోట్ల నిధులకు సంబంధించి చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాల ప్రణాళికను ఆయనకు అందజేశారు.  ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు, కాంగ్రెస్ నాయకుడు పసుమర్తి చందర్​రావు, మున్సిపల్​ఈవో నాగేశ్వరరావు, సిబ్బంది ఉన్నారు.