బిహార్‎ను నాశనం చేసిండు.. నితీశ్‎పై రాహుల్ ఫైర్

బిహార్‎ను నాశనం చేసిండు.. నితీశ్‎పై రాహుల్ ఫైర్

న్యూఢిల్లీ: బిహార్‎ను నితీశ్ కుమార్ ప్రభుత్వం నాశనం చేసిందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శించారు. విద్య, హెల్త్ కేర్‎తో పాటు అన్ని రంగాలనూ భ్రష్టు పట్టించిందని ‘జెన్ జడ్’ యూత్‎తో భేటీలో ఆయన ఫైర్ అయ్యారు. ఆ భేటీకి సంబంధించిన వీడియోను సోమవారం ‘ఎక్స్’లో ఆయన పోస్టు చేశారు. జెన్ జడ్ యూత్‎తో ఆయన మాట్లాడుతూ.. నేటి యువత సత్యం, అహింసను నమ్ముతుందని, భారత్‎ను ఉజ్వల భవిత వైపు నడుపుతుందన్నారు. 

‘‘భారత జెన్ జడ్‎పై నాకు నమ్మకం ఉంది. యువత రాజకీయాల్లోకి రావాలని నేను కోరుకుంటున్నా. వారు పాలిటిక్స్‎లోకి ఎంటరైతే ఎక్సైటింగ్‎గా ఉంటుంది. దళిత్, ఆదివాసీ, ఈబీసీ, ముస్లిం.. ఎవరైనా సరే అందరికీ సమాన అవకాశాలు ఉండాలి. అలాగే దేశ సంపద ఇద్దరు ముగ్గురు వ్యక్తుల చేతిలో కేంద్రీకృతం కాకూడదు” అని రాహుల్  వ్యాఖ్యానించారు. 

ఈ సందర్భంగా బిహార్  ఎన్నికల గురించి ఓ స్టూడెంట్ ప్రశ్నించగా.. బిహార్‎ను 20 ఏండ్లలో నితీశ్  సర్కారు నాశనం చేసిందని రాహుల్  మండిపడ్డారు. కాగా.. భేటీ అనంతరం యువతతో రాహుల్  సరదాగా ముచ్చటించారు. మిమ్మల్ని ఫన్నీగా ఏమని పిలవాలని ఓ యువతి అడగగా.. బ్రో అని పిలవండని రాహుల్  రిప్లై ఇచ్చారు.