దుక్కి దున్ని.. నాట్లు వేసిన రాహుల్​గాంధీ

దుక్కి దున్ని.. నాట్లు వేసిన రాహుల్​గాంధీ
  • రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న కాంగ్రెస్​ అగ్ర నేత

'భారత్​జోడో' యాత్ర తరువాత సమాజంలోని వివిధ వర్గాల ప్రజలను కలుస్తున్నారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​గాంధీ. ఇందులో భాగంగా లారీ డ్రైవర్లు, మెకానిక్​లు, వ్యాపారులు తదితర పనులు చేసే వారితో మాట్లాడుతూ.. వారి సాధక బాధకాలు అడిగి తెలుసుకుంటున్నారు. తాజాగా రాహుల్​గాంధీ హిమాచల్​ప్రదేశ్​ వెళ్తూ హర్యానాలోని సోనిపట్​ సమీపంలోని మదీనా గ్రామంలో పర్యటించారు. అక్కడ పొలంలో నాట్లు వేస్తూ కొందరు రైతులు కనిపించడంతో వారి దగ్గరికి వెళ్లారు.  తన ప్యాంట్​ని మోకాళ్ల వరకు మడిచారు. 

ట్రాక్టర్​తో దుక్కి దున్నారు. వెంటనే పొలంలోకి దిగి వరి నాట్లు వేశారు. రైతులు వరి నాటుతుండటాన్ని పరిశీలించారు. అక్కడి రైతులతో, కూలీలతో మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అయితే అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామంతో స్థానికులు ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు.