- రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న కాంగ్రెస్ అగ్ర నేత
'భారత్జోడో' యాత్ర తరువాత సమాజంలోని వివిధ వర్గాల ప్రజలను కలుస్తున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ. ఇందులో భాగంగా లారీ డ్రైవర్లు, మెకానిక్లు, వ్యాపారులు తదితర పనులు చేసే వారితో మాట్లాడుతూ.. వారి సాధక బాధకాలు అడిగి తెలుసుకుంటున్నారు. తాజాగా రాహుల్గాంధీ హిమాచల్ప్రదేశ్ వెళ్తూ హర్యానాలోని సోనిపట్ సమీపంలోని మదీనా గ్రామంలో పర్యటించారు. అక్కడ పొలంలో నాట్లు వేస్తూ కొందరు రైతులు కనిపించడంతో వారి దగ్గరికి వెళ్లారు. తన ప్యాంట్ని మోకాళ్ల వరకు మడిచారు.
ట్రాక్టర్తో దుక్కి దున్నారు. వెంటనే పొలంలోకి దిగి వరి నాట్లు వేశారు. రైతులు వరి నాటుతుండటాన్ని పరిశీలించారు. అక్కడి రైతులతో, కూలీలతో మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అయితే అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామంతో స్థానికులు ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు.