మోడీ మరోమారు చప్పట్లు కొట్టమంటారేమో

మోడీ మరోమారు చప్పట్లు కొట్టమంటారేమో

న్యూఢిల్లీ: ప్రధాని మోడీపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. దేశంలో బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో మోడీ సర్కార్ ను టార్గెట్ గా చేసుకొని విమర్శలకు దిగారు. కరోనాతో పాటు బ్లాక్ ఫంగస్ మహమ్మారి కూడా విజృంభిస్తోందని రాహుల్ తెలిపారు. వ్యాక్సిన్ కొరత ఎలాగూ ఉందని.. బ్లాక్ ఫంగస్ మందులు కూడా అందుబాటులో లేవన్నారు. గతంలో కరోనాను తరిమికొట్టేందుకు చప్పట్లు కొట్టమన్న మోడీ.. ఇప్పుడు ఈ బ్లాక్ ఫంగస్ పై పోరులోనూ అలాగే చేయమని పిలుపునిస్తారేమోనని వ్యంగ్యంగా కామెంట్ చేశారు.