తెలంగాణలో 8వ రోజు కొనసాగుతున్న రాహుల్ పాదయాత్ర

తెలంగాణలో 8వ రోజు కొనసాగుతున్న రాహుల్ పాదయాత్ర

రాహుల్ గాంధీ చేపట్టి ‘భారత్ జోడో యాత్ర’ తెలంగాణలో 8వ రోజు కొనసాగుతోంది. ఇవాళ బోయిన్ పల్లి గాంధీయన్ ఐడియాలజీ సెంటర్ నుండి రాహుల్ పాదయాత్ర ప్రారంభమైంది. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి రాహుల్ ఇవాళ 27.8 కిలోమీటర్లు దూరం పాదయాత్ర చేయనున్నారు. న్యూ బోయిన్ పల్లి, బాలనగర్ మెయిన్ రోడ్, ఫిరోజ్ గుడా, జింకల వాడ, మూసాపేట్, కూకట్ పల్లి, హఫీజ్ పేట మీదుగా మదినగూడ వరకూ పాదయాత్ర సాగనుంది. ఆ తర్వాత మధ్యాహ్న భోజనం సందర్భంగా విరామం తీసుకోనున్నారు. ఇవాళ రాత్రికి ముత్తంగిలో రాహుల్ గాంధీ బస చేయనున్నారు.

బాలీవుడ్ డైరెక్టర్ మహేష్ భట్ కూతురు పూజ భట్.. రాహుల్ తో కలిసి పాదయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీతక్కతో పాటు పలువురు సీనియర్ నాయకులు రాహుల్ తో కలిసి పాదయాత్ర చేస్తున్నారు. ఉదయం కొన్ని కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసిన తర్వాత ట్రీ బ్రేక్ తీసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ పాదయాత్రను ప్రారంభించారు.