
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పానా, స్క్రూడ్రైవర్ చేతపట్టారు. కొద్ది సేపు బైక్మెకానిక్ గా మారిపోయారు. ఇంతకీ ఎక్కడనుకుంటున్నారా.. ఢిల్లీలో.. ఆ వివరాలేంటో చూసేద్దాం పదండీ. జూన్27న రాత్రి ఢిల్లీలోని కరోల్బాగ్ సైకిల్ మార్కెట్లోని బైక్ రిపేర్ షాప్కి రాహుల్ వెళ్లారు. షాప్ యజమానికి వాహనాలు ఎలా రిపేర్ చేయాలో తెలుసుకున్నారు. సాధక బాధకాలు అడిగి తెలుసుకున్నారు.
కస్టమర్లు, వ్యాపారులతో ముచ్చటించారు. ఆ చేతులే భారత్ ని నిర్మిస్తాయని ఆయన పేర్కొన్నారు. వారి దుస్తులపై ఉన్న మసి మరకలు గర్వానికి నిదర్శనమని, వారి వెన్నంటి నిలబడి ప్రోత్సహించేది మాత్రం ప్రజా నాయకుడేనని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ తన ట్విటర్ అకౌంట్లో పోస్ చేసింది.