తాండూరు, వెలుగు: తాండూరులో రైల్వే పట్టాలపై గురువారం రైల్వే ఉద్యోగి డెడ్బాడీ దొరికింది. ఇతడిని ముత్యాలగల్లీలో ఉంటున్న గొంగళ్ల వ్యాపారి కుర్వ రాంచందర్, సర్వేశ్వరి దంపతుల పెద్ద కొడుకు నరేందర్ (32)గా గుర్తించారు. నరేందర్కు ఏడేండ్ల క్రితం రైల్వేశాఖలో ఎలక్ర్టానిక్ సిగ్నల్ మెయింటెనర్ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం బషీరాబాద్ (నవాంద్గి) రైల్వేస్టేషన్లో డ్యూటీ చేస్తున్నాడు. రోజు లెక్కనే గురువారం మార్నింగ్వాక్కు వెళ్లి తిరిగి రాలేదు. 9 గంటల ప్రాంతంలో ఫ్లై ఓవర్ పరిసరాల్లో రైలు పట్టాలపై మృతదేహం ఉండడంతో స్థానికులు పోలీసులకు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు మగ కవల పిల్లలున్నారు. ఇటీవల కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. తనకు ఉద్యోగం అంటే విరక్తి కలిగిందని కుటుంబసభ్యుల చెప్పాడని సమాచారం. పోస్టుమార్టం కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.