IND vs NZ : వర్షం కారణంగా ఆగిపోయిన మ్యాచ్

IND vs NZ : వర్షం కారణంగా ఆగిపోయిన మ్యాచ్

హామిల్టన్‌ వేదికగా భారత్, న్యూజిలాండ్‌  జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది.  4.5 ఓవర్లు ముగిశాక వర్షం పడటంతో మ్యాచ్ ను ఆపేశారు.  మ్యాచ్ ఆగిపోయే సమయానికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 22 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (2*), శుభ్‌మన్ గిల్ (19*) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ఈ మ్యాచ్ లో  టాస్‌ ఓడి టీమిండియా బ్యాటింగ్‌ దిగింది.  ఈ సిరీస్ రేసులో నిలవాలంటే భారత్ కు ఇది తప్పక గెలవాల్సిన మ్యాచ్.  తొలి వన్డేలో భారీ స్కోర్ చేసినప్పటికీ ఓటమి తప్పలేదు. 


జట్ల వివరాలు: 


భారత్: శిఖర్ ధావన్‌ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, రిషభ్‌ పంత్, సూర్యకుమార్‌, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్‌ సింగ్, యుజ్వేంద్ర చాహల్‌

న్యూజిలాండ్‌: ఫిన్ అలెన్, డేవన్ కాన్వే, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డారిల్‌ మిచెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, మైకెల్ బ్రాస్‌వెల్, మ్యాట్ హెన్రీ, టిమ్ సౌథీ, లాకీ ఫెర్గూసన్