హైదరాబాద్, వెలుగు: రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్కు ఈ ఏడాది జూన్తో ముగిసిన క్వార్టర్లో రూ. 287.17 కోట్ల రెవెన్యూ వచ్చింది. కిందటేడాది జూన్ క్వార్టర్లో వచ్చిన రూ. 237.15 కోట్లతో పోలిస్తే ఇది 21.1 % గ్రోత్కు సమానం. ఇబిటా (ట్యాక్స్లకు ముందు లాభం) రూ.82.09 కోట్ల నుంచి 6.8 శాతం పెరిగి రూ.87.7 కోట్లకు చేరుకుంది.
నికర లాభం 7 శాతం వృద్ధి సాధించి రూ.38.76 కోట్ల నుంచి రూ.41.4 కోట్లకు పెరిగింది. జూ న్ క్వార్టర్లో స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ చేశామని , కంపెనీ రెవెన్యూ 21 % వృద్ధి సాధించిందని రెయిన్బో చిల్డ్రన్స్ ఎండీ కంచర్ల రమేష్ అన్నారు. ఇప్పటికే ప్రకటించిన ప్రాజెక్ట్లను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేస్తామన్నారు.