జేఎన్టీయూ పరిధిలో ఈ నెల11న జరగాల్సిన బీటెక్, బీఫార్మసీ ఫోర్త్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్, 12న జరగాల్సిన బీటెక్, బీఫార్మసీ ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ వాయిదా వేస్తున్నట్టు ఆ వర్సిటీ రిజిస్ట్రార్ మంజూరు హుస్సేన్ ప్రకటించారు. త్వరలోనే రీషెడ్యూల్ డేట్లను ప్రకటిస్తామన్నారు. అయితే ఈ నెల 16 నుంచి జరిగే పరీక్షలన్నీ గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతాయని చెప్పారు.
ఓయూ ఎగ్జామ్స్వాయిదా
ఓయూ, వెలుగు: వర్షాల కారణంగా ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో ఓయూ పరిధిలో ఈ నెల 11 నుంచి 13 తేదీల మధ్య జరగాల్సిన అన్ని రకాల పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్లక్ష్మీనారాయణ చెప్పారు. పరీక్షలను తిరిగి నిర్వహించే తేదీలను త్వరలో ప్రకటిస్తామని, అందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఓయూ వెబ్సైట్ లో అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. 14 నుంచి జరగాల్సిన పరీక్షలు యథావిధిగా జరుగుతాయని పేర్కొన్నారు.