MM. Keeravani: కీరవాణికి పద్మశ్రీ.. రాజమౌళి ఇంట్రెస్టింగ్ ట్వీట్

MM. Keeravani: కీరవాణికి పద్మశ్రీ.. రాజమౌళి ఇంట్రెస్టింగ్ ట్వీట్

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి.. తన సోదరుడు ఎం.ఎం. కీరవాణికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించడంపై సంతోషం వ్యక్తం చేశాడు. కీరవాణిని చూస్తే తనకు గర్వంగా ఉందని చెప్పారు. ఆయనతో కలిసి కూర్చున్న ఫొటోను షేర్ చేసిన రాజమౌళి.. తన అన్నకు(కీరవాణి) వరుస అవార్డులు రావడం ఆనందంగా ఉందన్నాడు. అయితే, అవార్డుకు అవార్డుకు మధ్య కాస్త గ్యాప్ ఇవ్వమని యూనివర్స్ ను కోరుతూ.. ‘కాస్త గ్యాప్ ఇవ్వమ్మా. ఒకటి పూర్తిగా ఎంజాయ్ చేశాక ఇంకొకటి ఇవ్వు’ అంటూ ట్విట్టర్ లో చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.   

ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ దక్కింది. ఇప్పుడు ఆస్కార్ అవార్డ్స్ కు నామినేట్ అయింది. భారతీయ సినిమాలకు ఇంతటి కీర్తిని అందించినందుకు కీరవాణికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. పద్మ శ్రీ అవార్డుకు ఎంపికైన కీరవాణికి పలువురు అభినందనలు చెబుతున్నారు.