జెట్​ స్పీడ్​గా ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్​ లెటర్లు రిలీజ్​ చేయడంలో ‘రాజన్న’ జిల్లా ఫస్ట్​

జెట్​ స్పీడ్​గా ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్​ లెటర్లు రిలీజ్​ చేయడంలో ‘రాజన్న’ జిల్లా ఫస్ట్​
  • జిల్లాలో 7,862 మంజూరు కాగా.. 7,828 ఇండ్లకు శాంక్షన్​ లెటర్లు 
  • జిల్లాకు అదనంగా 6,446 ఇండ్లు
  • రెండు నియోజకవర్గాల్లోనే మొత్తం 14వేలకు పైగా ఇండ్లు మంజూరు

రాజన్న సిరిసిల్ల, వెలుగు:పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్పీడందుకున్నాయి. ఇండ్ల మంజూరు పత్రాల జారీలో రాజన్న సిరిసిల్ల జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. జిల్లాకు 7,862 ఇండ్లు మంజూరు కాగా, 7,828 ఇండ్ల శాంక్షన్ ​లెటర్లు లబ్ధిదారులకు అందజేశారు. కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సందీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఝా ప్రత్యేక చొరవ తీసుకుంటుండడంతో జిల్లా యంత్రాంగం ఉరుకుల పరుగుల మీద శాంక్షన్​ లెటర్లు అందజేస్తున్నారు. 

ఇటీవల కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జిల్లా ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి మంత్రి ఉత్తమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి, ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు హాజరైన మంత్రులు పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు ఇండ్ల మంజూరు పత్రాల జారీలో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిపిన కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అభినందించారు. 

స్పీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ప్రొసీడింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ​లెటర్లు 

రాజన్నసిరిసిల్లలో వేములవాడ, సిరిసిల్ల నియోజకర్గాలకు చెరో 3500 చొప్పున 7వేల ఇండ్లు మంజూరయ్యాయి. వీటితోపాటు మానకొండూరు, చొప్పదండి నియోజకవర్గాల్లోని ఇల్లంతకుంట, బోయినిపల్లి మండలాలు జిల్లా పరిధిలో ఉండగా వీటికి 862 ఇండ్లు మంజూరయ్యాయి. మొత్తంగా జిల్లాకు 7,862 ఇండ్లు మంజూరయ్యాయి. వీటిలో 7,828 ఇండ్లకు ప్రొసీడింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెటర్లు అందజేశారు. మొదటి విడుతలో మంజూరైన వాటిలో 1,061 ఇండ్లు గ్రౌండింగ్ పూర్తయింది. వీటిలో బేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ లెవెల్ లో 105, రూఫ్ లెవెల్ లో 31లో ఉన్నాయి. దీంతో లబ్ధిదారుల ఖాతాల్లో రూ.1.36కోట్లు జమయ్యాయి. 

అదనంగా 6,446 ఇండ్లు 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున 7862 ఇండ్లు మంజూరు కాగా.. వీటికి అదనంగా జిల్లాకు మరో 4696 ఇండ్లను ప్రభుత్వం ప్రత్యేకంగా మంజూరు చేసింది. వీటిని మిడ్ మానేరులో మునిగిన 12 గ్రామాల నిర్వాసితులకు కేటాయించనున్నారు. దీంతోపాటు ఇటీవల రుద్రంగి మండల కేంద్రంలోని జరిగిన రెవెన్యూ సదస్సుకు మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. 

ఈ  మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వేములవాడ ఎమ్యెల్యే, విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ నియోజకవర్గంలో ముంపు బాధితుల కోసం మరిన్ని ఇండ్ల కావాలని అడగగా.. మరో 1750 ఇండ్లు ఇవ్వనున్నట్లు పొంగులేటి ప్రకటించారు. వీటికి సంబంధించిన జీవో జారీ కావాల్సి ఉంది. మొత్తంగా జిల్లాకు 14,308 ఇండ్లు మంజూరయ్యాయి. 

సిరిసిల్లలో లబ్ధిదారుల ఎంపికను పట్టించుకోని కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

సిరిసిల్ల నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పట్టించుకోవడంలేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో లబ్ధిదారుల ఎంపికలో స్థానిక ఎమ్మెల్యేలే లిస్ట్ ప్రిపేర్ చేసి ప్రభుత్వానికి ఇస్తున్నారు. కానీ సిరిసిల్లలో కేటీఆర్ ఈ ప్రక్రియను పట్టించుకోవడంలేదని ప్రజల్లో అసంతృప్తి ఉంది. దీంతో ప్రభుత్వం నియమించిన ఇందిరమ్మ ఇండ్ల కమిటీనే లబ్ధిదారుల లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తయారు చేసే పనిలో ఉన్నారు. 

సొంతింటి కల నెరవేరుతోంది

మాకు రేకుల ఇల్లు ఉండేది. చాలా ఏండ్లు ఇబ్బందిపడ్డం. ఇల్లు కట్టుకునే పరిస్ధితి లేక ఆగినం. రాష్ట్ర ప్రభుత్వం అందించే సాయంతో ఇల్లు కట్టుకుంటున్న. బేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాకా కట్టగానే నా బ్యాంకు అకౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ. లక్ష పడ్డయి. సొంతింటి కలను నెరవేరుస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్యే ఆది శ్రీనన్నకు రుణపడి ఉంటాం. - కత్తెర లక్ష్మి, పెద్దూర్, సిరిసిల్ల మున్సిపాలిటీ