ప్రతి మున్సిపాలిటీలో బీజేపీ జెండా ఎగరాలి : రాజా సింగ్

ప్రతి మున్సిపాలిటీలో బీజేపీ జెండా ఎగరాలి : రాజా సింగ్

నల్గొండ జిల్లాలో పర్యటించిన బీజేపీ నేత, గోషామహబ్ ఎమ్మెల్యే రాజాసింగ్.. నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి జిల్లాలో బీజేపీ జెండా ఎగరాలన్నారు.  పార్లమెంట్ ఎన్నికల్లో దక్కిన విజయం బీజేపీ హవాకు ఆరంభం మాత్రమే అన్నారు. రాష్ట్రంలో వచ్చే ఏడాది అధికారంలోకి వచ్చేది బీజేపీయే అన్నారు. రాష్ట్రాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల తెలంగాణగా మార్చిందన్నారు. బంగారు తెలంగాణ పేరుతో లక్షల కోట్లు అప్పు చేసిన ఘనత కేసీఆర్ దే అని విమర్శించారు. కేవలం మాటలతో కాలం వెళ్లదీస్తున్నారే గానీ చేతలు లేవని అన్నారు గోషామహల్ ఎమ్మెల్యే.