
శ్రీ శారద రమణా క్రియేషన్స్ బ్యానర్పై నంద కిషోర్ నిర్మాణంలో నూతన దర్శకుడు సూర్యాస్ రూపొందిస్తున్న చిత్రం ‘చేతబడి’. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ కథను గురించి దర్శకుడు సూర్యాస్ మాట్లాడుతూ.."చేతబడి అనేది 16వ శతాబ్దంలో మన ఇండియాలోనే పుట్టింది. రెండు దేశాలు శత్రుత్వానికైనా, మిత్రుత్వానికైనా పరస్పరం బలం.. బలగం ఉండాలి.
కానీ ఒక ఈవిల్ ఎనర్జీతో మనిషిని కలవకుండా అతనిని చంపే విద్యే చేతబడి. అది ఎంత భయంకరంగా ఉంటుందో ఇప్పటికే చాలా సినిమాల్లో చూపించారు. ఇందులో చాలా విభిన్నంగా చూపిస్తున్నాం. మన బాడీలో ప్రతిదానికి ఒక ప్రాణం ఉంటుంది. జుట్టుకు కూడా ఒక ప్రాణం ఉంటుంది. ఆ వెంట్రుకల ఆధారంగానే ఈ సినిమా ఆధారపడి ఉంటుంది.
1953 గిరిడ అనే గ్రామంలో రియల్గా జరిగిన యదార్థ సంఘటనను ఆధారంగా చేసుకుని ఈ కథను సిద్ధం చేశారు. సీలేరు అనే గ్రామంలో 2 వందల సంవత్సరాల క్రితం వెదురు బొంగులు చాలా థిక్గా ఉండేవి. వర్షం పడినా అవి నేల కూలేవి కావు. అలాంటి మట్టిలో బతికున్న నల్లకోడిని పెట్టి అమావాస్య రోజు బాణామతి చేస్తే ఎలా ఉంటుందనేది ఈ సినిమాలో చూపించబోతున్నాం" అని దర్శకుడు చెప్పాడు.
►ALSO READ | మోహన్ బాబు, విష్ణుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట.. 2019 నాటి కేసు కొట్టివేత!
నిర్మాత నందకిషోర్ మాట్లాడుతూ.."ఒకప్పుడు బాణామతి భయం వల్ల రాజకీయ, సామాజిక, మానసిక సమస్యలు తలెత్తాయి. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న కొందరి గురించి ఈ ‘చేతబడి’ చిత్రంలో రియలిస్టిక్గా చూపించబోతున్నాం" అని చెప్పాడు.