దుబాయ్: ఐపీఎల్-13 సీజన్లో భాగంగా ఆదివారం సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. సన్రైజర్స్ నిర్దేశించిన 159 పరుగుల టార్గెట్లో ఆదిలో తడబడిన రాజస్తాన్ను తెవాటియా గెలిపించాడు. టాపార్డర్ కోల్పోయి కష్టాల్లో పడ్డ సమయంలో తెవాటియా ధనాదన్ ఇన్నింగ్స్తో అలరించాడు. అతనికి జతగా రియాన్ పరాగ్ సహకరించడంతో ఇంకా బంతి ఉండగా రాజస్తాన్ విజయాన్ని అందుకుంది. తెవాటియా 28 బంతుల్లో 4 ఫోర్లు, 2సిక్స్లతో 45 పరుగులతో అజేయంగా నిలవగా, పరాగ్ 26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 42 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు.
What a way to win the game. A MAXIMUM by Riyan Parag as @rajasthanroyals beat #SRH by 5 wickets.
This has been absolutely phenomenal by Tewatia and Parag.#Dream11IPL pic.twitter.com/vchiPNAPWJ
— IndianPremierLeague (@IPL) October 11, 2020