రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవిని తాను వదిలిపెట్టాలని భావించినప్పటికీ.. ఆ పదవే తనను వదలడం లేదన్నారు. సీఎం పదవిపై అశోక్ గెహ్లాట్.. ఇలా మాట్లాడటం ఈ మధ్య ఇది రెండోసారి. జైపూర్లో జరిగిన కొత్త జిల్లాల వ్యవస్థాపక కార్యక్రమంలో అశోక్ గెహ్లాట్ ఈ కామెంట్స్ చేశారు.
సీఎం పదవిని వదిలేయాలని తన మనసులో ఉన్నా.. ఎందుకు వదిలేయాలన్నది మాత్రం మిస్టరీనే అన్నారు అశోక్ గెహ్లాట్. సీఎం పదవే తనను వీడడం లేదని.. అధిష్ఠానం ఏం నిర్ణయం తీసుకున్నా తనకు అంగీకారమే అని చెప్పారు. తనను ముఖ్యమంత్రిగా మూడుసార్లు సోనియా గాంధీ ఎంపిక చేయడం సామాన్య విషయం కాదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ విజయం సాధిస్తే.. విజన్ 2030ని అమలు చేస్తామని తెలిపారు. తాను ప్రవేశపెట్టిన సంస్కరణల వల్లే రాజస్తాన్ బలమైన రాష్ట్రంగా ఎదిగిందన్నారు.