
జైపూర్: సోషల్ మీడియాలో పరిచయమైన ఓ అమ్మాయి వలలో పడి.. మన దేశ రక్షణ రంగ సమాచారాన్ని పాక్కు చేరవేసిన రాజస్తాన్కు చెందిన ఓ వ్యక్తి కటకటాలపాలయ్యాడు. అల్వార్లో నివాసం ఉండే మంగత్ సింగ్కు రెండేండ్ల కింద సోషల్ మీడియాలో ‘ఇషా శర్మ’ పేరిట గుర్తుతెలియని ఓ అమ్మాయి పరిచయమైంది. మాయమాటలు చెప్పి.. అతడ్ని ఆ యువతి ముగ్గులోకి దింపింది. భారత మిలిటరీకి చెందిన సమాచారాన్ని మంగత్ సింగ్ నుంచి రాబట్టింది.
అల్వార్ ఆర్మీ కంటోన్మెంట్తోపాటు పలు ఆర్మీ స్థావరాల లోకేషన్స్ను ఆమెకు మంగత్ సింగ్ ఆమెకు చేరవేశాడు. ఇందుకోసం డబ్బులు తీసుకున్నాడు. సదరు మహిళ.. పాకిస్తాన్ ఇంటర్నల్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఏస్ఐ)కి చెందిన ఉద్యోగిగా తేలింది. మంగత్ సింగ్ను అధికారులు శుక్రవారం అదుపులోకి ప్రశ్నిస్తున్నారు.