ఈ నెల 30న ‘రాజయోగం’

ఈ నెల 30న ‘రాజయోగం’

సాయి రోనక్, అంకిత సాహా జంటగా రామ్ గణపతి రూపొందించిన చిత్రం ‘రాజయోగం’. మణి లక్ష్మణ్ రావు నిర్మాత. ఈ నెల 30న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సాయి రోనక్ మాట్లాడుతూ ‘ఇదొక రొమాంటిక్ ఎంటర్ టైనర్. రెండు గంటలు హాయిగా నవ్వుకునేలా ఉంటుంది. డ్రైవర్‌‌‌‌గా కనిపిస్తా. ఓనర్ స్థానంలో ఒక అమ్మాయిని కలిసేందుకు పెద్ద హోటల్‌‌కు వెళ్తా. నేను రిచ్ అని ఆమె, ఆ అమ్మాయికి డబ్బుందని నేను అంచనాలు పెంచుకుంటాం. 

ఈ డ్రామా చివరకు ఎలా ముగిసింది అనేది కథ. పదివేల కోట్లు విలువైన డైమండ్స్ అనే పాయింట్‌‌ కూడా ఆసక్తి రేపుతుంది. ఫైట్స్, డాన్స్ లాంటి అన్ని కమర్షియల్ అంశాలుంటాయి. రొమాంటిక్ సీన్స్ ఉన్నా  ఇబ్బంది పెట్టేలా ఉండవు. నేను కొందరు స్టార్స్‌‌కు డ్యాన్సులు నేర్పించా. ఆ స్కిల్ చూపించే అవకాశం ఇందులో దక్కింది. ఒకే జానర్‌‌‌‌కు ఫిక్స్ అవకుండా డిఫరెంట్ జానర్ మూవీస్ చేస్తున్నా. నీలకంఠ డైరెక్ట్ చేస్తున్న థ్రిల్లర్‌‌తో పాటు ఉషాకిరణ్ బ్యానర్‌‌‌‌లో ఓ సినిమా, అవికా గోర్‌‌‌‌తో ‘పాప్ కార్న్’ అనే సినిమా చేస్తున్నా. ఇవన్నీ నాకు వెర్సటైల్ ఆర్టిస్ట్‌‌గా పేరు తెస్తాయని ఆశిస్తున్నా' అన్నారు.