రాజీవ్​ యువ వికాసం వాయిదా ... జాగృతి విజయం

రాజీవ్​ యువ వికాసం వాయిదా ... జాగృతి విజయం
  • పథకానికి అమరవీరుల పేరు పెట్టాలంటూ ప్రశ్నించా...
  • అందుకే పోస్ట్​పోన్​ చేశారు: ఎమ్మెల్సీ కవిత

బషీర్​బాగ్, వెలుగు: రాజీవ్ గాంధీకి తెలంగాణతో ఏం సంబంధం ఉందని, యువ వికాసం స్కీమ్​కు అమరవీరుల పేరు పెట్టాలని డిమాండ్ చేయడంతో ఈ కార్యక్రమం వాయిదా వేశారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇది జాగృతి విజయమని చెప్పారు. ఈ స్కీమ్​లో దాగున్న కుట్రను ప్రజలు గమనించాలని కోరారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాగృతి ఆధ్వర్యంలో అబిడ్స్ బొగ్గుల కుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్​లో యువ కవుల సమ్మేళనం నిర్వహించారు.

ముఖ్యఅతిథిగా ఆమె హాజరై మాట్లాడారు. సాహిత్యం, కవిత్వం సమాజాన్ని మంచి మార్గంలో నడిపిస్తాయన్నారు.  ప్రజల  పక్షాన ఎప్పుడూ ప్రశ్నిస్తూనే ఉంటానని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రశ్నించానని చెప్పారు. తెలంగాణ సాహిత్యం, సంస్కృతిని కాపాడడం కోసమే జాగృతి ఏర్పడిందని, యువ కవుల నుంచి వచ్చిన 50 ఉత్తమ కవితలను ఎంపిక చేసి, ఈ కార్యక్రమం 
నిర్వహిస్తున్నట్లు తెలిపారు.