రాజేంద్ర ప్రసాద్, నటి అర్చన.. ఈ జోడీ పేరు వింటే వంశీ తీసిన'లేడీస్ టైలర్' సినిమా గుర్తుకు వస్తుంది. ఆ సినిమా వచ్చిన 37 ఏళ్లకు మళ్లీ ఈ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. ‘షష్ఠిపూర్తి’ టైటిల్తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో లీడ్ రోల్స్ చేస్తున్నారు. రూపేష్ కుమార్ చౌదరి, ఆకాంక్షా సింగ్ హీరోహీరోయిన్స్. పవన్ ప్రభ దర్శకుడు. రూపేష్ కుమార్ నిర్మిస్తున్నాడు.
చెన్నైలోని ఇళయరాజా స్టూడియోస్లో శుక్రవారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ఇళయరాజా కెమెరా స్విచాన్ చేయగా, సూపర్ గుడ్ ఫిలింస్ అధినేత ఆర్బి చౌదరి క్లాప్ కొట్టారు. వై. విజయ, శుభలేఖ సుధాకర్ ఇతక కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ‘ఇదొక న్యూ ఏజ్ ఫ్యామిలీ డ్రామా. ఈ నెలలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం. జులైలో రిలీజ్కి ప్లాన్ చేస్తున్నాం’ అన్నారు దర్శకనిర్మాతలు.