గండిపేట, వెలుగు: తెలంగాణ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి స్కీంలో భాగంగా నగరంలో ఏర్పాటు చేస్తోన్న క్యాంటీన్లు పేదల ఆకలి తీర్చేందుకు ఎంతగానో ఉపయోగపడుతాయని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్గౌడ్ అన్నారు. శనివారం ఆరాంఘర్ బస్టాప్, కాటేదాన్ సిటిజన్ కాంటా వద్ద ఏర్పాటు చేసిన ఇందిరమ్మ క్యాంటీన్లను ఆయన ప్రారంభించారు. అల్పాహారం వడ్డించి ప్రజలతో కలిసి బ్రేక్పాస్ట్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ క్యాంటీన్ల ద్వారా రూ.5 కే అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందించడం శుభపరిణామమన్నారు. ఇది పేదలు, అడ్డా కూలీలు, ఆటో డ్రైవర్లు, చిరు వ్యాపారులు, నిరుద్యోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు ఎన్.ధనుంజయ్, సరికొండ వెంకటేశ్, మసున వెంకటేశ్, కాశీగారి యాదగిరి, బొల్లా వెంకటేశ్, ఓంప్రకాశ్పాల్గొన్నారు.
