
కోల్బెల్ట్, వెలుగు: సింగరేణి అండర్గ్రౌండ్ బొగ్గు గనులు, ఓపెన్కాస్ట్ మైన్లలో విద్యుత్ ప్రమాదాల నివారణకు భద్రతా ప్రమాణాలు పాటించాలని డిప్యూటీ డైరెక్టర్ మైన్స్సేఫ్టీ(ఎలక్ట్రికల్) రాజీవ్ఓంప్రకాశ్వర్మ సూచించారు. శనివారం సాయంత్రం మందమర్రిలోని స్కిల్డెవలప్మెంట్కాన్ఫరెన్స్హాల్లో ఎలక్ట్రికల్సేఫ్టీ, టెక్నాలజీ ఇంటరాక్టివ్సెషన్నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. అధికారులు, ఉద్యోగులకు విద్యుత్ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించాలని సూచించారు.
కేకే ఓసీపీ, కేకే–5 గనుల్లో ఎలక్ట్రికల్సేఫ్టీపై తనిఖీలు చేశారు. అనంతరం మందమర్రి ఏరియా సింగరేణి జీఎం జి.దేవేందర్, ఆఫీసర్లు ఆయనను సన్మానించారు. బెల్లంపల్లి రీజియన్సేఫ్టీ జీఎం కె.రఘుకుమార్, ఎస్వోటూ జీఎం విజయప్రసాద్, ఏరియా ఇంజినీర్ వెంకటరమణ, సేఫ్టీ ఆఫీసర్ ఎం.రవీందర్, కేకే గ్రూప్ ఏజెంట్రాంబాబు, కేకే ఓసీపీ పీవో ఎం.మల్లయ్య, ఎంవీటీసీ మేనేజర్శంకర్, ఇంజినీర్లు, ఎలక్ర్టికల్సూపర్వైజర్లు పాల్గొన్నారు.