హైదరాబాద్, వెలుగు: రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ అధ్వర్వంలోని ఓపెన్ ప్లాట్ల విక్రయాలకు మరోసారి మంచి స్పందన వచ్చింది. హైదరాబాద్ నగర శివారు ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని తొర్రూర్, కుర్మల్ గూడ, బహదూర్ పల్లి, ప్రాంతాల్లోని 163 ప్లాట్లకు బహిరంగ వేలం నిర్వహించారు.
ఈ వేలంలో తొలి రోజు సోమవారం తొర్రూర్లోని 59 ప్లాట్లకు వేలం నిర్వహించారు. ఈ విక్రయాల్లో అత్యధికంగా చదరపు గజానికి రూ.39 వేల ధర పలికింది. ఈ ప్రాంతంలో చదరపు గజానికి సగటున రూ.28,700 ధర పలికింది. ఇక్కడి భూములకు కనీస ధర రూ.25 వేలుగా నిర్ధారించి వేలం నిర్వహించారు.
59 ప్లాట్ల విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ.46 కోట్ల మేర ఆదాయం వచ్చిందని స్వగృహ కార్పొరేషన్ ఎండీవీపీ గౌతమ్ తెలిపారు. ఈ వేలం పాటలో 110 మంది బిడ్డర్లు పాల్గొన్నారని ప్రకటించారు. తొర్రూర్ ప్రాంతంలోని 65 ప్లాట్లకు, కుర్మల్గూడలోని 25, బహదూర్ పల్లిలోని 13 మొత్తం 103 ప్లాట్లకు మంగళవారం బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
