రెస్టారెంట్​ వ్యాపారంలోకి రకుల్​ప్రీత్​సింగ్​

రెస్టారెంట్​ వ్యాపారంలోకి రకుల్​ప్రీత్​సింగ్​

హైద‌‌‌‌రాబాద్, వెలుగు: టాలీవుడ్, బాలీవుడ్ న‌‌‌‌టి ర‌‌‌‌కుల్ ప్రీత్ సింగ్ తొలిసారిగా త‌‌‌‌న సొంత డైన్-ఇన్ రెస్టారెంట్ “ఆరంభం-స్టార్ట్ విత్ మిల్లెట్”ను ప్రారంభిస్తున్నారు. హైదరాబాద్‌‌‌‌లోని మాదాపూర్‌‌‌‌లో ఏప్రిల్ 16న ఇది మొదలుకానుంది.  

ఫుడ్ అండ్ బెవరేజెస్ సంస్థ, క్లౌడ్ కిచెన్ ఆపరేటర్ క్యూర్ ఫుడ్స్ తో కలిసి ఈ రెస్టారెంటును రకుల్ ప్రీత్ నిర్వహించనున్నారు. ఇక్కడ పూర్తిగా చిరుధాన్యాలతో కూడిన వంటకాలే ఉంటాయి, ప్రతి గింజలోనూ పోషక విలువలు ఉంటాయి.  ర‌‌‌‌కుల్ ఈ రెస్టారెంటుకు బ్రాండ్ అంబాసిడ‌‌‌‌ర్‌‌‌‌గా కూడా ఉంటారు. ఆరోగ్యకర’మైన ఆహారపు అలవాట్లు ఉంటే మన ఆరోగ్యం చాలా బాగుంటుందని ఆమె చెప్పారు.