Rakul Preet Singh: ఆరంభం.. మిల్లెట్స్తో.. హైదరాబాద్లో రకుల్ కొత్త బిజినెస్

Rakul Preet Singh: ఆరంభం.. మిల్లెట్స్తో.. హైదరాబాద్లో రకుల్ కొత్త బిజినెస్

స్టార్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh) హైదరాబాద్ లో మరో కొత్త బిజినెస్ స్టార్ట్ చేయనున్నారు. ఇప్పటికే ఆమెకు హైదరాబాద్ లో ఎఫ్ 45 పేరుతో జిమ్ ఉన్న సంగతి తెలిసిందే. చాలా మంది స్టార్ ఈ జిమ్ లోనే కసరత్తులు చేస్తుంటారు. ఇదే కాకుండా.. వెల్ బీయింగ్ న్యూట్రిషన్, వెల్నెస్ న్యూట్రిషన్, హెల్త్ అండ్ స్కిన్, న్యూబూ వంటి సంస్థల్లో కూడా ఆమె పార్ట్నర్ గా ఉన్నారు. ఇపుడు తాజాగా మరో క్రేజీ బిజినెస్ లోకి అడుగుపెడుతున్నారు రకుల్. 

ఇంతకీ ఆ బిజినెస్ ఏంటంటే.. ఆరంభం.. మిల్లెట్లతో పేరుతో ఓ రెస్టారెంట్ ఓపెన్ చేయనున్నారు రకుల్. మాదాపూర్ క్యూర్ ఫుడ్స్‌తో కలిసి ఈ రెస్టారెంట్ ఓపెన్ చేయనున్నారు. పూర్తిగా చిరు ధాన్యాల(మిల్లెట్స్)తో కూడిన ఆరోగ్యకరమైన వంటకాలే లభించే ఈ రెస్టారెంట్ ఏప్రిల్ 16న గ్రాండ్ గా ఓపెన్ కానుంది. ప్రస్తుతం ఫుడ్ బిజినెస్ కు ఉన్న డిమాండ్ దృష్ట్యా ఈ డెసిషన్ తీసుకున్నారట రకుల్. అయితే.. అందులోనే కేవలం ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలనే ఉద్దేశయంతోనే ఈ మిల్లెట్ రెస్టారెంట్ ఓపెన్ చేయనుంరట రకుల్.

ఇక రకుల్ ప్రీత్ సింగ్ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే ఆమె తమిళ హీరో శివ కార్తికేయన్ తో చేసిన అయలాన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సైన్స్ ఫిక్షన్ కథాంశం తో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా తరువాత స్టార్ డైరెక్టర్ శంకర్, లోకనాయకుడు కమల్ హాసన్ కాంబోలో వస్తున్న భారతీయుడు 2లో కూడా కీ రోల్ చేస్తున్నారు రకుల్ ప్రీత్. భారీ అంచనాలున్న ఈ సినిమా జూన్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఆమె బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నాని ని పెళ్లిచేసుకున్నారు.