
ఏపీలో నిన్న విడుదలైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జనసేన పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది. అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాను పోటీచేసిన రెండు స్థానాల్లోనూ ఘోరపరాజయం పాలయ్యాడు. ఈ ఓటమిపై, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఫేస్ బుక్ వేదికగా స్పందించారు.
“గొప్ప నాయకులు కేవలం నాయకులుగానే మిగిలిపోరు, మార్పు అంటే ఏంటో చూపిస్తారు. ఇది ఓ పాత్రకు సంబంధించిన విషయం కాదు, ఇదంతా ఓ లక్ష్యానికి సంబంధించిన విషయం” అంటూ పోస్టు పెట్టారు. ఈ ఎన్నికల సందర్భంగా పవన్ కల్యాణ్ గారికీ, జనసేన పార్టీకి సేవలు అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అంటూ తన పోస్టులో పేర్కొన్నారు.