నెల్లూరు: దేశంలోని అతిపెద్ద సినిమా స్క్రీన్ ను హీరో రామ్ చరణ్ ప్రారంభించాడు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు దగ్గర్లో దేశంలోనే అతిపెద్ద స్క్రీన్ తో కూడిన మల్టీప్లెక్స్ థియేటర్ను నిర్మించారు. యూవీ క్రియేషన్స్ రూ.40 కోట్లతో పిండిపాళెంలో ఈ ‘వి సెల్యులాయిడ్’ థియేటర్ను నిర్మించింది. రామ్ చరణ్ ప్రారంభించిన ఈ థియేటర్ లో ఈ నెల 30న ‘సాహో’ సినిమాను ప్రదర్శించనున్నారు.
దేశంలోనే ఎక్కడా లేని విధంగా మొదటిసారిగా 106 అడుగుల వెడల్పు, 54 అడుగుల ఎత్తయిన స్ర్కీన్, 656 సీట్ల కెపాసిటీ.. 3డీ సౌండ్ సిస్టమ్ తో థియేటర్ ను నిర్మించారు. ఇలాంటి థియేటర్లు ఆసియా ఖండంలో మరో రెండు మాత్రమే ఉన్నాయని తెలిపింది యూవీ క్రియేషన్స్.