ఇండియన్ సినీ ఇండస్ట్రీలో వారసులు సక్సెస్ ఐన సందర్భాలు చాలా అరుదు. ఆ లిస్టులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram charan) ఒకరు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన చరణ్.. మొదట విమర్శలు ఎదుర్కొన్నా.. తరువాత తన హార్డ్ వర్క్ తో విమర్శకుల నుండి ప్రశంసలు అందుకున్నారు. ఒక్కో సినిమాకి తనను తాను ప్రూవ్ చేసుకుంటూ.. గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. ఆర్ఆర్ఆర్(RRR) సక్సెస్ తరువాత చరణ్ రేంజ్ నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది. తన సక్సెస్ ను చూసి తండ్రి చిరంజీవి సైతం గర్వపడేలా చేశారు చరణ్. ఇదే విషయాన్ని మెగాస్టార్ కూడా చాలాసార్లు చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే.. మరోసారి మెగాస్టార్ చిరంజీవి గర్వపడే పని చేశారు రామ్ చరణ్. 16 ఏళ్ళ క్రితం జరిగిన తెలుగు సినిమా వజ్రోత్సవ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి కొన్ని ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఆ స్టేజిపై ఆయన మాట్లాడుతూ.. గోవా ఫిలిం ఫెస్టివల్ లో మన తెలుగు నటులకు సరైన గుర్తింపు లేదని.. ఎస్వీఆర్, ఏఎన్నార్, ఎన్టీఆర్ వంటి గొప్ప నటులకు సరైన గౌరవం లభించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
? @AlwaysRamCharan is the Only Contemporary Actor & Only South Indian Actor Placed Amidst the Legends of Indian Cinema. #IFFI54
— Johnnie Walker (@Johnnie5ir) November 21, 2023
pic.twitter.com/XLc50Rtyhl
ఇప్పుడు తన తండ్రి చెప్పిన మాటలను నిజం చేసి చూపించారు రామ్ చరణ్. ప్రస్తుతం గోవాలో జరుగుతున్న ఫిలిం ఫెస్టివల్ లో రామ్ చరణ్ ఫోటోను ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఇది చూసిన మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఫెస్టివల్ లో రామ్ చరణ్ ఫోటోను టాగ్ యాడ్ చేస్తూ.. తండ్రి చెప్పిన మాటల్ని కొడుకే నిజం చేశాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.