
గచ్చిబౌలి, వెలుగు: డైరెక్టర్రామ్గోపాల్వర్మ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. తన అనుమతి లేకుండా 'దహనం' వెబ్సిరీస్లో తన ఐడెంటిటీని ఉపయోగించారని రిటైర్డ్ఐపీఎస్ఆఫీసర్ అంజనా సిన్హారాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రామ్గోపాల్వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు.
2022లో దహనం వెబ్సిరీస్ వచ్చింది. ఈ సిరీస్కు డైరెక్టర్రామ్గోపాల్వర్మే నిర్మాతగా వ్యవహరించారు. ఎంఎక్స్ ప్లేయర్లో విడుదలైన ఈ వెబ్సిరీస్ను కొద్దిరోజులకు తొలగించారు. ఈ సిరీస్లో నక్సలైట్లకు, ప్యూడలిస్టులకు మధ్య జరిగే పోరాటాన్ని తెరకెక్కించారు. 1990 ఏపీ బ్యాచ్కు చెందిన ఐపీఎస్ఆఫీసర్అంజనా సిన్హా డీఐజీ, ఏడీజీపీ హోదాల్లో పనిచేశారు.
ఈ వెబ్సిరీస్లో అంజనా సిన్హా ఐడెంటిటీని ఉపయోగించారు. దీంతో తాను దహనం వెబ్సిరీస్ నిర్మాత, దర్శకుడిని ఎప్పుడూ కలవలేదని, మాట్లాడలేదని, తన అనుమతి లేకుండా తన పాత్రను సిరీస్లో చూపించారన్నారు. తన వ్యక్తిగత హక్కులకు భంగం వాటిల్లిందని, రామ్ గోపాల్ వర్మపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో రామ్గోపాల్వర్మపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు