ఇది అంతకంటే పెద్ద వెన్నుపోటు.. పవన్పై ఆర్జీవి సంచలన కామెంట్స్

ఇది అంతకంటే పెద్ద వెన్నుపోటు.. పవన్పై ఆర్జీవి సంచలన కామెంట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన కామెంట్స్ చేసాడు. అయన తన ఫ్యాన్స్ ని చంపేశాడు అంటూ మండిపడ్డాడు. ఈమేరకు తన ట్విట్టర్ ఖాతాలో పవన్ ను ఉద్దేశించి కామెంట్స్ పోస్ట్ చేసాడు. మే 11న పవన్ ఆంధ్రాలో వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను పరామర్శించడానికి గోదావరి జిల్లాలకు వెళ్లిన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా పవన్ టీడీపీ,బీజేపీ పొత్తులపై స్పందించాడు. "ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా పొత్తులు పెట్టుకుంటాం. పొత్తులపై నా స్టాండ్ మారలేదని, కండిషన్లు పెట్టి సీఎం పదవి సాధించలేం. సీఎం పదవి వరించి రావాలిని ఆయన పేర్కొన్నారు". ఇక ఇదే అంశంపై తాజాగా స్పందించిన వర్మ.. "ఆరోజు చంద్రబాబు, ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచినదానికంటే దారుణంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన జన సైనికులను, తన ఫ్యాన్స్ ను వెన్నుపోటు పొడిచి చంపేశాడు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా  ప్రగాఢ సానుభూతి అంటూ కామెంట్ చేసాడు.

ప్రస్తుతం వర్మ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఈ కామెంట్స్ పై జనసేన పార్టీ నుండి, జన సైనికుల నుండి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.