
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, వివాదాస్పద చిత్రం ది కేరళ స్టోరీ పై స్పందించాడు. ఈ సినిమా అసలైన పాన్ ఇండియా మూవీ అన్నట్లుగా తన అభిప్రాయం ను వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ సినిమాపై పలుచోట్ల నిరసనలు జరుగుతున్న నేపధ్యంలో ఈ మేరకు స్పందించాడు వర్మ.
ది కేరళ స్టోరీ సినిమా అసలైన పాన్ ఇండియా మూవీ. ఎందుకంటే.. ఈ సినిమాలో తమిళ, మలయాళ అమ్మాయిలు ప్రధాన పాత్ర లో నటించారు. గుజరాత్ కు చెందిన నిర్మాత నిర్మించాడు. బెంగాళీ వ్యక్తి ఈ సినిమాను డైరెక్ట్ చేయడం జరిగింది. ఈ సినిమా అన్ని భాషల కలయికగా రూపొందినది కాబట్టి ఇది అసలైన పాన్ ఇండియా మూవీ అన్నట్లుగా వర్మ పేర్కొన్నాడు. నిజమైన పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకాన్ని కూడా వర్మ వ్యక్తం చేశాడు.
ప్రస్తుతం ది కేరళ స్టోరీ మూవీపై వర్మ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ సినిమాపై పలు రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతున్న విషయం తెల్సిందే. కొన్ని చోట్ల స్వయంగా ప్రభుత్వాలే ఈ సినిమాని బ్యాన్ చేశాయి. దాంతో విడుదల అయిన చోట.. ఈ సినిమాలో ఏముందో చూడాలని చాలా మంది ఆడియన్స్ థియేటర్లకి వచ్చారు. దీంతో విడుదల అయిన అన్ని చోట్ల డీసెంట్ ఓపెనింగ్స్ ను దక్కించుకుంది సినిమా. లాంగ్ రన్ లో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందనేది ట్రేడ్ వర్గాల నుండి వినిపిస్తున్న మాట.