
రామ్ పోతినేని హీరోగా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ఫేమ్ పి.మహేష్ బాబు రూపొందిస్తున్న చిత్రం ‘ఆంధ్రా కింగ్ తాలూకా’.రామ్ కెరీర్లో ఇది 22వ సినిమా. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఇప్పటికే సగానికిపైగా షూటింగ్ పూర్తవగా, కొత్త షెడ్యూల్ను రాజమండ్రిలో స్టార్ట్ చేశారు. ఈ షెడ్యూల్లో రామ్తో పాటు ముఖ్య పాత్రధారులంతా పాల్గొంటున్నారు. ఇందులో రామ్ ఇప్పటివరకు చేయని ఒక యూనిక్ క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు.
ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్, మెర్విన్ సంగీతం అందిస్తున్నారు.
New schedule of #AndhraKingTaluka begins in Rajahmundry ❤🔥
— Mythri Movie Makers (@MythriOfficial) June 29, 2025
Key sequences featuring Energetic Star @ramsayz & @nimmaupendra are being shot ✨
▶️ https://t.co/kw9BbCAGkK#RAPO#BhagyashriBorse @filmymahesh @MythriOfficial @iamviveksiva @mervinjsolomon @siddnunidop… pic.twitter.com/pquRlilMF4