థాయ్‌‌లాండ్‌‌లో డబుల్ ఇస్మార్ట్‌ షూటింగ్

థాయ్‌‌లాండ్‌‌లో డబుల్ ఇస్మార్ట్‌ షూటింగ్

ఇస్మార్ట్‌‌ శంకర్‌‌‌‌ లాంటి సక్సెస్‌‌ఫుల్ మూవీ తర్వాత హీరో రామ్,  పూరి జగన్నాథ్ కాంబినేషన్‌‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్‌‌’. సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే  ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. ప్రస్తుతం థాయ్‌‌లాండ్‌‌లో షూటింగ్ జరుగుతోంది. గురువారం పూరి జగన్నాథ్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్‌‌‌‌తో ఆయనకు విషెస్‌‌ను తెలియజేసింది టీమ్. 

ఇందులో రామ్, సంజయ్ దత్‌‌తో కలిసి చేతిలో డబుల్ బ్యారెల్ గన్‌‌లు పట్టుకుని కనిపించారు పూరి జగన్నాథ్‌‌. రామ్, సంజయ్ దత్ ట్రెండీ డ్రెస్సులతో స్టైలిష్‌‌ గెటప్‌‌లో ఇంప్రెస్ చేస్తున్నారు.  పూరి జగన్నాథ్, ఛార్మి కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహా శివరాత్రి సందర్భంగా  మార్చి 8న పాన్ ఇండియా వైడ్‌‌గా సినిమా విడుదల కానుంది.