నాలుగేళ్ల క్రితం రామ్, పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. అప్పటి వరకు వరుస ఫెయిల్యూర్స్తో ఉన్న రామ్ ఈ సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడు. మరోసారి ఈ క్రేజీ కాంబినేషన్ రిపీట్ కానుందనే టాక్ వినిపిస్తోంది. అయితే అది ఇస్మార్ట్ సీక్వెలా... లేక వేరే కథా అనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. రామ్లోని మరో యాంగిల్ను చూపించిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’.
దీంతో వీరిద్దరి కలయిక అనగానే టాలీవుడ్లో అప్పుడే అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం రామ్ బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. దసరాకి సినిమా విడుదల కానుంది. పూరిజగన్నాథ్ మాత్రం.. ‘లైగర్’ తర్వాత ఏ మూవీకి కమిట్ అయినట్టు ప్రకటించలేదు. దీంతో రామ్ ప్రస్తుత సినిమా పూర్తవగానే దీన్ని పట్టాలెక్కించే ప్లాన్లో ఉన్నారట.