రామగుండం కాంగ్రెస్​ టికెట్​ మాలో టికెట్‌‌‌‌ ఎవరికిచ్చినా ఓకే!

రామగుండం కాంగ్రెస్​ టికెట్​ మాలో టికెట్‌‌‌‌  ఎవరికిచ్చినా ఓకే!

రామగుండం కాంగ్రెస్​ టికెట్​తమలో ఎవరికిచ్చినా ఓకే అంటున్నారు ముగ్గురు సీనియర్లు. టికెట్​కోసం అప్లికేషన్​ పెట్టుకున్న పీసీసీ ఉపాధ్యక్షుడు హర్కర వేణుగోపాలరావు, ఐఎన్‌‌‌‌టీయూసీ సెక్రటరీ జనరల్‌‌‌‌ జనక్‌‌‌‌ ప్రసాద్‌‌‌‌, హెచ్‌‌‌‌ఎంఎస్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ రియాజ్‌‌‌‌ అహ్మద్‌‌‌‌ ఇటీవల ఎన్టీపీసీ ఏరియాలో మీటింగ్​ పెట్టుకున్నారు. తమ ముగ్గురిలో ఎవరికి టికెట్‌‌‌‌ దక్కినా మిగతా వాళ్లు నారాజ్​ కాకుండా కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారు. 

అయితే ఇక్కడ కాంగ్రెస్​టికెట్​మక్కాన్ సింగ్‌‌‌‌ రాజ్‌‌‌‌ ఠాకూర్‌‌‌‌ కు ఇచ్చే అవకాశముంది. ఆయన టికెట్​ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుండగా హైకమాండ్​ కూడా సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన సీనియర్లు.. ఐక్యతారాగం అందుకున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వీరి ఐక్యతను హైకమాండ్​ ఎంత వరకు గుర్తిస్తుందో.