రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కు 216వ ర్యాంక్

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కు 216వ ర్యాంక్

గోదావరిఖని, వెలుగు: కేంద్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసిన స్వచ్చ సర్వేక్షణ్ 2024-–25  ర్యాంకుల్లో రామగుండం కార్పొరేషన్​ ఉత్తమ ర్యాంక్ సాధించింది. దేశవ్యాప్తంగా 4,589 పట్టణాలతో పోటీపడి 216 వ ర్యాంకు సాధించింది. అలాగే రాష్ట్రంలోని 143 మున్సిపాలిటీల్లో 28వ స్థానంలో నిలిచింది.  

ఈ ఏడాది మల్కాపూర్ వద్ద నిర్మించిన ఫీకల్​స్లడ్జ్​ట్రీట్మెంట్​ప్లాంట్(ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీటీపీ)ని వినియోగంలోకి తీసుకురావడంతో రామగుండం కార్పొరేషన్​కు​ ఓపెన్​ డెఫకేషన్​ ఫ్రీ (ఓడిఎఫ్)లో ప్లస్ హోదా దక్కింది. బల్దియా ఉత్తమ ర్యాంక్ సాధించడానికి కృషి చేసిన అధికారులు, సిబ్బందిని అడిషనల్​కలెక్టర్, కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అరుణ శ్రీ  అభినందించారు.