- ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే బీసీ రిజర్వేషన్లు: రాంచందర్రావు
హైదరాబాద్, వెలుగు: దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ ‘కగార్’ చేపట్టిందని బీజేపీ స్టేట్చీఫ్ రాంచందర్ రావు చెప్పారు. తుపాకులు వదిలి మార్చి31 లోగా లొంగిపోవాలని మావోయిస్టులను కేంద్రం హెచ్చరించిందని.. ఇది వారికి జనజీవన స్రవంతిలో కలిసేందుకు మంచి అవకాశమని తెలిపారు. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు.
లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రిమిజం ఈ దేశం నుంచి వెళ్లిపోవాలని, ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సహించేది లేదన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని ఆరోపించారు. లోకల్బాడీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్నారు.
