మెగా అభిమాని నూర్ మహ్మద్ కుటుంబానికి మెగాపవర్స్టార్ రామ్చరణ్ రూ.10 లక్షల విరాళం ఇచ్చారు. నెల రోజుల క్రితం హైదరాబాద్ సిటీ చిరంజీవి యువత అధ్యక్షులు నూర్ అహ్మద్ గుండెపోటుతో మరణించారు. దీంతో ఇవాళ నూర్ అహ్మద్ కుటుంబ సభ్యులను రామ్ చరణ్ తన ఇంటికి పిలిపించుకొని రూ.10 లక్షల చెక్ ను వారికి అందజేశారు.
నూర్ ఫ్యామిలీకి అండగా ఉంటానన్నారు రాంచరణ్. నూర్ అహ్మద్ లేని లోటును తీర్చలేను కానీ వారి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామన్నారు. నూర్ ఇంటికి పెద్దకొడుకుగా ఉంటానన్నారు చరణ్. నూర్ కొడుకుకు మంచి ఉద్యోగం ఇప్పిస్తానన్నారు. అంతేగాకుండా ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లకు తానే స్వయంగా వస్తానని భరోసా ఇచ్చారు చరణ్.