కరోనా వ్యాక్సిన్లతో ప్రయోజనం లేదు

కరోనా వ్యాక్సిన్లతో ప్రయోజనం లేదు

అల్లోపతి వైద్యంపై ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా కరోనా వ్యాక్సిన్‌తో ఎలాంటి ఉపయోగం లేదన్నారు. తాను టీకా తీసుకోలేదని, సుదీర్ఘం కాలంగా సాధన చేస్తున్న యోగా, ఆయుర్వేదమే తనకు రక్ష అని తెలిపారు. పురాతన భారతీయ వైద్య విధానం ఆయుర్వేదానికి వ్యతిరేకంగా ఒక పథకం ప్రకారం పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోందని బాబా రాందేవ్ ఆరోపించారు. దశాబ్దాలుగా యోగా, ఆయుర్వేదం అభ్యసిస్తున్నానని.. అందుకే తనకు టీకా అవసరం లేదని చెప్పారు. రానున్న కాలంలో ఆయుర్వేదానికి ప్రపంచవ్యాప్తంగా ఆమోదం లభించనుందని రాందేవ్ ధీమా వ్యక్తం చేశారు.

కొద్ది రోజుల కిందట బాబా రాందేవ్ పై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తో పాటు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ఘాటుగా స్పందించారు. దీంతో వెంటనే రామ్ దేవ్ బాబా క్షమాపణలు చెప్పి.. ఆ వివాదానికి తెరదించారు.