బీజేపీకి ఓట్లు వేసే వారు రాక్షసులు : కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

బీజేపీకి ఓట్లు వేసే వారు రాక్షసులు : కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ  రణదీప్ సూర్జేవాలా  బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.  హర్యానాలోని కైతాల్‌లో జరిగిన జన్ ఆక్రోశ్ ర్యాలీలో  సూర్జేవాలా మాట్లాడుతూ.. బీజేపీకి మద్దతిచ్చి ఓటేసే వారెవరైనా రాక్షసులేనని అన్నారు.  వారిని తాను ఈ మహాభారత భూమి నుండి శపిస్తానన్నారు. 

ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. రణదీప్ సుర్జేవాలా పార్టీ ఓటర్లను దుర్భాషలాడి వారిని కించపరిచారని, వారిని రాక్షసులు అని పిలవడం వల్ల కాంగ్రెస్  పార్టీ నేతలు ఎంతటి సంస్కారవంతులో అర్థం అవుతోందని విమర్శిస్తున్నారు.