వైభవంగా రంగనాయక స్వామి రథోత్సవం

వైభవంగా రంగనాయక స్వామి రథోత్సవం

ఘట్​కేసర్, వెలుగు: ఘట్​కేసర్ మున్సిపాలిటీ ఎదులాబాద్​లోని శ్రీగోదా సమేత మన్నార్ రంగనాయకస్వామి రథోత్సవం శుక్రవారం వైభవంగా జరిగింది. మాజీ మంత్రి మల్లారెడ్డి, టీపీసీసీ ఉపాధ్యకుడు తోటకూర  వజ్రేశ్​యాదవ్, అంబర్​పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్​రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్​చంద్రారెడ్డి, హరివర్తన్​రెడ్డి రథాన్ని ముందుకు లాగి ప్రారంభించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది.